ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణమే తమ ధ్యేయమని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు అసెంబ్లీ టు అరసవల్లి పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆంక్షల నడుమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఈ యాత్ర నిలిచిపోయింది.