ప్రస్తుతం భారతదేశం ఊబకాయంతో బాధపడుతుంది. రోజురోజుకీ ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించాలని చాలామంది డైటీషియన్లు చెబుతున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారే ఆహారంలో చిరుధాన్యాలను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందటమే కాకుండా రోగ కారకాలు కూడా తొలగిపోతాయని, ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు.