ఈ సారి వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మరో మూడు నెలపాటు ఎండలు కొనసాగనున్నాయి. ఈసారి సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పదే పదే చెబుతోంది. మరి ఈ సమయంలో ఎండల దాటి నుంచి రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.